Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరుగుతున్న ఆత్మహత్యలతో సర్వత్ర ఆందోళన

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 28, 2026 9:58 AM మంచిర్యాలక్రైమ్
పెరుగుతున్న ఆత్మహత్యలతో సర్వత్ర ఆందోళన - Udayam Digital
లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో గత రెండు నెలల్లో పదిమందికిపైగా వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యం, అప్పుల భారం, ఒంటరితనం వంటి సమస్యలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మానసిక నిపుణులు లేదా పోలీసులను సంప్రదించాలని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...