Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

వరి ఉత్పత్తిలో భారత్ నంబర్-1

Ravi Singh Jun 08, 2026 11:51 AM అల్ ఇండియా 4 viewsabout 7 hours ago
వరి ధాన్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇండోర్‌లో జరిగే బ్రిక్స్ సదస్సులో సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపుపై చర్చించనున్నట్లు చెప్పారు. తక్కువ వర్షపాతం ఉన్న 197 జిల్లాల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. 'ఖేతీ బచావో అభియాన్' ద్వారా రైతులకు అండగా ఉంటూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Comments

G
Loading comments...