Back to feed
చేబ్రోలు వద్ద ఘోర ప్రమాదం: దంపతుల దుర్మరణం
Sonia Singh Jun 08, 2026 10:11 AM కాకినాడ 3 viewsabout 9 hours ago

ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను ఒక లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన సత్యనారాయణ (45), అరుణకుమారి (40) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...



