వార్తలకు తిరిగి వెళ్లండి

వైవిధ్య నటుడు ధనుష్ త్వరలో తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేయనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' సెట్స్లో యాత్ర కెమెరా వెనుక కనిపించడంతో ఈ ప్రచారం మొదలైంది.
ఈ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. యాత్ర ప్రధాన పాత్రలో ఒక మాస్ కమర్షియల్ కథ సిద్ధమైందని, త్వరలోనే లుక్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...
