వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశ అత్యవసర ఇంధన నిల్వ సామర్థ్యాన్ని 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఉన్న చమురు స్టాక్ను, భవిష్యత్తు అవసరాల కోసం ఏకంగా 90 రోజులకు పెంచాలని చమురు సంస్థలను ఆదేశించనుంది.
దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే లభిస్తోంది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా దేశీయంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కేంద్రం ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.
Comments
Loading comments...
