వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరచింత మున్సిపల్ కమిషనర్ నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ నూర్ అహ్మద్ మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. వార్డు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి చెత్త పొడి చెత్త వేరుచేసి మున్సిపాలిటీ చెత్త బండిలో వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ విష్ణు ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...
