వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి బారులుతీరారు. ఆలయ అర్చకులు వీరాంజనేయుడికి విశేష అభిషేకాలు, అలంకరణలు మరియు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
జై హనుమాన్ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Comments
Loading comments...
