వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయంగా మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అడ్డుకునే అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించే 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' (FATF) వైస్ ప్రెసిడెన్సీ స్థానాన్ని చరిత్రలోనే తొలిసారిగా భారత్ దక్కించుకుంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ జూలై 2026 నుండి జూన్ 2027 కాలపరిమితికి ఎఫ్ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. పారిస్ నగర కేంద్రంగా పనిచేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఎంపికవడంపై ఆయన స్పందిస్తూ, తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...
