వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు లాభపడింది. సెన్సెక్స్ 109 పాయింట్లు పెరిగి 77,100 వద్ద ముగియగా, నిఫ్టీ 24,056 పాయింట్ల వద్ద స్థిరపడింది. చమురు ధరలు దిగిరావడం మార్కెట్కు కలిసొచ్చింది.
అయితే లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్లోని మెజారిటీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. వాహన, బ్యాంకింగ్ రంగాలు రాణించగా, టెక్ మరియు పవర్ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. విదేశీ, దేశీయ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు కొనసాగాయి.
Comments
Loading comments...
