వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండ జిల్లా డిండి సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న రెండు డీసీఎంలను, మూగజీవాలతో వెళ్తున్న మరో డీసీఎం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చిట్టికొండ ఎల్లయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డాయి.
డీసీఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డుపై మరమ్మతులు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
