వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉండగా.. బుధవారం గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...
