Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌టెల్‌, విఐలకు సుప్రీం నోటీసులు

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 08, 2026 8:20 PM ఆల్ ఇండియా జాతీయ
ఎయిర్‌టెల్‌, విఐలకు సుప్రీం నోటీసులు - Udayam Digital
వన్‌టైమ్ స్పెక్ట్రమ్ ఛార్జీలను రద్దు చేసిన బాంబే హైకోర్టు తీర్పును కేంద్రం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాలకు నోటీసులు జారీ చేసింది. 6.2 మెగాహెర్ట్జ్‌కు మించి స్పెక్ట్రమ్ వినియోగించినందుకు ఛార్జీలు చెల్లించాలని కేంద్రం వాదించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ప్రస్తుతం ఎలాంటి స్టే విధించలేదు.

Comments

G
Loading comments...