వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కమిషనర్ రంగనాథ్పై వచ్చిన ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఎడ్ల సుధాకర్ రెడ్డి సమర్పించిన ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది.
దీనిపై స్పందించిన రంగనాథ్, ఇది సాధారణ ప్రక్రియేనని తెలిపారు. అయితే, తనపై చర్యలు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, అధికారులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...
