వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు ఆర్థర్ కాటన్ అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరం లో కాటన్ విగ్రహానికి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పూలమాలవేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాటన్ లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారన్నారు.
Comments
Loading comments...
