వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) సన్నాహాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియ ఓట్ల తొలగింపు కాదని, కేవలం జాబితాలో స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన మాత్రమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
జూన్ 25 నుంచి బీఎల్వోలు ఇంటింటి సర్వే చేపడతారు. జూలై 31న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. ఓటర్లు ఆగస్టు 30 వరకు తమ వివరాలను సరిచూసుకోవచ్చు. తుది జాబితా అక్టోబరు 1న ప్రచురితమవుతుంది.
Comments
Loading comments...
