వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఆయిల్ ఫామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ కోరారు. సోమవారం సాయంత్రం ఎల్లారం గ్రామంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలలో ఆయిల్ ఫామ్ ముందు వరుసలో ఉంటుందన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగుకు రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మౌనిక, రైతు రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...
