వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అటవీ అనుమతులు, నిధుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...
